16 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్
- October 24, 2018
ఇస్లామాబాద్ : సరిహద్దులను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 16 మంది భారత జాలర్లను పాకిస్తాన్ అధికారులు మంగళవారం అరెస్టు చేశారని ఆ దేశ భద్రతా దళాలు బుధవారం వెల్లడించాయి. పాకిస్తాన్ తీర ప్రాంత భూభాగాన్ని ఉల్లంఘించి, తమ జలాల్లోకి జాలర్లు చొరబడ్డారని, సముద్రంలో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా గుర్తించామని మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(ఎంఎస్ఎ) తెలిపింది. వారి పడవలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. జాలర్లను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించామని పేర్కొంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







