16 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్‌

- October 24, 2018 , by Maagulf
16 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్‌

ఇస్లామాబాద్‌ : సరిహద్దులను ఉల్లంఘించి తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 16 మంది భారత జాలర్లను పాకిస్తాన్‌ అధికారులు మంగళవారం అరెస్టు చేశారని ఆ దేశ భద్రతా దళాలు బుధవారం వెల్లడించాయి. పాకిస్తాన్‌ తీర ప్రాంత భూభాగాన్ని ఉల్లంఘించి, తమ జలాల్లోకి జాలర్లు చొరబడ్డారని, సముద్రంలో చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా గుర్తించామని మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(ఎంఎస్‌ఎ) తెలిపింది. వారి పడవలను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. జాలర్లను అదుపులోకి తీసుకుని, విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించామని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com