ఎతిహాద్ విమానంలో మహిళ ప్రసవం
- October 24, 2018
ముంబయి:యూఏఈలోని అబుదాబీ నుంచి ఇండోనేషియాలోని జకార్తా వెళ్తోన్న ఎతిహాద్ విమానంలో బుధవారం ఉదయం ఇండోనేషియాకు చెందిన మహిళ ప్రసవించింది. మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఈవై 474 విమానాన్ని వెంటనే ముంబయికి మళ్లించారు. ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ల్యాండ్కాగానే మహిళను అంధేరీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డకు చికిత్స అందించామని, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యవసర ల్యాండింగ్ వల్ల విమానం రెండు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుతున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







