ఎతిహాద్ విమానంలో మహిళ ప్రసవం
- October 24, 2018
ముంబయి:యూఏఈలోని అబుదాబీ నుంచి ఇండోనేషియాలోని జకార్తా వెళ్తోన్న ఎతిహాద్ విమానంలో బుధవారం ఉదయం ఇండోనేషియాకు చెందిన మహిళ ప్రసవించింది. మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఈవై 474 విమానాన్ని వెంటనే ముంబయికి మళ్లించారు. ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ల్యాండ్కాగానే మహిళను అంధేరీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డకు చికిత్స అందించామని, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యవసర ల్యాండింగ్ వల్ల విమానం రెండు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుతున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!