ఎతిహాద్ విమానంలో మహిళ ప్రసవం
- October 24, 2018
ముంబయి:యూఏఈలోని అబుదాబీ నుంచి ఇండోనేషియాలోని జకార్తా వెళ్తోన్న ఎతిహాద్ విమానంలో బుధవారం ఉదయం ఇండోనేషియాకు చెందిన మహిళ ప్రసవించింది. మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఈవై 474 విమానాన్ని వెంటనే ముంబయికి మళ్లించారు. ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ల్యాండ్కాగానే మహిళను అంధేరీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డకు చికిత్స అందించామని, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యవసర ల్యాండింగ్ వల్ల విమానం రెండు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుతున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







