విశాఖ వన్డే: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ టై
- October 24, 2018
విశాఖ: ఉత్కంఠతో అభిమానులను ఊపేసిన విశాఖ వన్డే చివరి టై అయింది. కోహ్లీసేన నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ప్రాణం పెట్టింది. ఒక్క పరుగు తేడాతో విజయాన్ని దూరం చేసుకుంది.
కరీబియన్ జట్టుదే సునాయాస గెలుపు అనుకున్న వేళ టీమిండియా విజృంభించింది. ఆఖరి పది ఓవర్లను కట్టుదిట్టంగా విసిరింది. పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీస్తూ తీవ్ర ఒత్తిడి పెంచింది. చివరి ఓవర్లో విండీస్ 14 పరుగులు చేయాలి. ఉమేశ్ యాదవ్ బౌలర్. ఒత్తిడి చంపేస్తున్నా షై హోప్ (123; 134 బంతుల్లో 10×4, 3×6) అజేయంగా నిలిచాడు. భారీ షాట్లు ఆడలేకపోయినా ఒక్కో పరుగు తీశాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా బౌండరీ బాది మ్యాచ్ను టై చేశాడు. అతడి సహచరుడు హెట్ మెయిర్ (94; 64 బంతుల్లో 4×4, 7×6) చెలరేగి ఆడాడు. వీరిద్దరి బ్యాటింగ్తో లక్ష్యాన్ని విండీస్ సమం చేసింది. అంతకు ముందు కోహ్లీ (157 నాటౌట్; 129 బంతుల్లో 13×4, 4×6), అంబటి రాయుడు (73; 80 బంతుల్లో 8×4) చెలరేగి ఆడారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







