విశాఖ వన్డే: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ టై
- October 24, 2018
విశాఖ: ఉత్కంఠతో అభిమానులను ఊపేసిన విశాఖ వన్డే చివరి టై అయింది. కోహ్లీసేన నిర్దేశించిన 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ప్రాణం పెట్టింది. ఒక్క పరుగు తేడాతో విజయాన్ని దూరం చేసుకుంది.
కరీబియన్ జట్టుదే సునాయాస గెలుపు అనుకున్న వేళ టీమిండియా విజృంభించింది. ఆఖరి పది ఓవర్లను కట్టుదిట్టంగా విసిరింది. పరుగులు ఇవ్వకుండా వికెట్లు తీస్తూ తీవ్ర ఒత్తిడి పెంచింది. చివరి ఓవర్లో విండీస్ 14 పరుగులు చేయాలి. ఉమేశ్ యాదవ్ బౌలర్. ఒత్తిడి చంపేస్తున్నా షై హోప్ (123; 134 బంతుల్లో 10×4, 3×6) అజేయంగా నిలిచాడు. భారీ షాట్లు ఆడలేకపోయినా ఒక్కో పరుగు తీశాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా బౌండరీ బాది మ్యాచ్ను టై చేశాడు. అతడి సహచరుడు హెట్ మెయిర్ (94; 64 బంతుల్లో 4×4, 7×6) చెలరేగి ఆడాడు. వీరిద్దరి బ్యాటింగ్తో లక్ష్యాన్ని విండీస్ సమం చేసింది. అంతకు ముందు కోహ్లీ (157 నాటౌట్; 129 బంతుల్లో 13×4, 4×6), అంబటి రాయుడు (73; 80 బంతుల్లో 8×4) చెలరేగి ఆడారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







