827 వెబ్సైట్లు బ్లాక్.. కేంద్రం ఆదేశం..
- October 25, 2018
మొత్తం 827 వెబ్సైట్లు బ్లాక్ అయ్యాయి. స్మార్ట్పోన్లు అందుబాటులోకి వచ్చాక మనుషుల మధ్య మాటలు తక్కువయ్యాయి. ఫోన్లలో మాటలు ఎక్కువయ్యాయి. ప్రపంచమంతా అర చేతిలో ఉందని ఓ పక్క సంతోషంగా ఉన్నా చిన్నా పెద్దా ఫోన్కి బానిసలవుతున్నారని బాధపడే పరిస్థితే ఎక్కువగా ఉంది. నలుగురు పిల్లలు చేరి ఫోన్ని చూస్తూ కూర్చున్నారంటే వారు ఫోన్లో ఏం చూస్తున్నారో అని పెద్దవాళ్లు భయపడుతున్న సందర్భాలు అనేకం. అర్థరాత్రి గదిలో లైట్లు వెలుగుతూనే ఉంటాయి. ఇంకా పడుకోలేదా అంటే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నానంటూ అబద్ధాలు.
పిల్లల మాటలు, చేతలతో అమ్మా నాన్నలకి నిద్రపట్టని రాత్రులు. సినిమాలైతే పెద్దవారికి మాత్రమే అని మార్క్ చేసి వస్తాయి. మరి ఫోన్ల విషయానికి వస్తే.. అంతా ఓపెన్. ఇదే విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి 827 అశ్లీల సైట్లను బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 827 వెబ్సైట్ల జాబితాను టెలికామ్ విభాగానికి అందజేసారు. నిలిపివేత తక్షణం అమలులోకి రావాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో టెలికామ్ విభాగం పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!