దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్కి సిద్ధమా?
- October 25, 2018
దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ నేటితో ప్రారంభమవుతోంది. 30 రోజుల ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ కోసం యూఏఈ అంతటా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫిట్నెస్పై ఏ మాత్రం అవగాహన, ఆసక్తి లేని అనురూమా ముఖర్జీ అనే వ్యక్తి.. ఈ ఫిట్నెస్ ఛాలెంజ్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా అయినా తనకు ఫిట్నెస్పై అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీన్ని చాలా స్మార్ట్ ఇనీషియేటివ్ అని ఆమె కొనియాడారు. సాధారణంగా తాను 30 నిమిషాలపాటు నడుస్తుంటాననీ, ఇకపై ఆ నడకను 45 నిమిషాలకు పెంచుతానని వివరించారామె. మెడిటేషన్, ఎక్సర్సైజ్లు వంటివి కూడా చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు ముఖర్జీ. అల్ జలీలా ఫౌండేషన్లో పనిచేసే మరియా బగ్నులో మాట్లాడుతూ, ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ తనకు ఎంతో ఉపయోగపడిందనీ, తనతోపాటు తన టీమ్ అంతటికీ ఫిట్నెస్పై అవగాహన కల్పించేలా చేసిందని అన్నారు. మరియా మరియు ఆమె టీమ్, పలు ఈవెంట్స్ని నిర్వహించారు. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కోసం వాకథాన్ని, ట్రయాథ్లాన్నీ, మారథాన్లను కూడా నిర్వహించారు. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న సైకా అన్వర్ మాట్లాడుతూ, టీచర్లుగా తాము ఫిజికల్ స్ట్రెస్ని అనుభవిస్తుంటామనీ, ఫిట్నెస్ ఛాలెంజ్ తమకు మానసికంగా, శారీరకంగా ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









