సారీ మోడీ..రాలేను - ట్రంప్
- October 28, 2018
వాషింగ్టన్: వచ్చే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ ఇండియా పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా అధికారులు ఇప్పటికే ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్కు చేరవేసినట్లు సమాచారం. ఆ సమయంలో అమెరికాలోనే కొన్ని ముఖ్యమైన పనులు ఉన్న కారణంగా ట్రంప్ రాలేకపోతున్నారని అమెరికా అధికారులు వివరించారు. స్టేట్ ఆఫ్ ద యూనియన్ ప్రసంగంతోపాటు, ఇతక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో ట్రంప్ పాల్గొనాల్సి ఉంది. ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నందుకు చింతిస్తున్నానని ట్రంప్ అన్నారు. వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే గణతంత్ర వేడుకలకు రావాల్సిందిగా ఈ ఏడాది ఏప్రిల్లోనే ట్రంప్కు ఇండియా అధికారిక ఆహ్వానం పంపించింది.
అప్పుడే తమకు ఆహ్వానం అందినట్లు తెలిపిన అమెరికా.. దీనిపై సెప్టెంబర్లో రెండు దేశాల మధ్య జరగబోయే 2+2 సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ మధ్య కాలంలో ఇరాన్ ఆయిల్, రష్యాతో రక్షణ ఒప్పందాల నేపథ్యంలో ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ఇండియా ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా ఆహ్వానాన్ని తిరస్కరించడం చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







