అమెరికాలో యూదులపై కాల్పులు.. 11 మంది మృతి
- October 28, 2018
అమెరికాలోని పిట్స్బర్గ్లో శనివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూదుల ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. దుండగుడు సెమీఆటోమెటిక్ రైఫిల్తో కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితునిపై ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. కాల్పులు జరిపినపుడు 'యూదులందరూ చనిపోవాల్సిందే' అని నిందితుడు నినాదాలు చేశాడు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







