రూ.100కోట్లతో ప్రముఖుల భద్రతకు బెల్జియం ఆయుధాలు
- October 28, 2018
ప్రముఖుల భద్రత కోసం బెల్జియం దేశానికి చెందిన అధునాతన ఆయుధాల ను కొనుగోలు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులతో పాటు ఎస్పిజి రక్షణ లో వున్న వివిఐపిల కోసం త్వరలో ఈ ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం కేంద్రం వంద కోట్ల రూపాయలను వెచ్చించేందుకు నిర్ణయించింది. ప్రముఖుల భద్రత కల్పిస్తున్న ఎస్పిజి కమెండోల వద్ద ప్రస్తుతం గ్లాక్ పిస్ట ళ్లు, ఎంపి 5 సబ్ మెషిన్స్తో పాటు ఎకె 47, ఎకె 56 తుపాకులు వున్నాయి. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంతో పాటు తీవ్ర వాద సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖుల భద్రత కల్పించడం భద్రతా బలగాలకు సవాల్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెల్జియం దేశానికి చెందిన ఎఫ్.ఎన్ పిస్టళ్లతో పాటు ఫైవ్ సెవన్ పి 90 సబ్ మిషిన్స్ తెప్పించేందుకు కేం ద్రం నిర్ణయించింది. ఈ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఇప్పటికే బెల్జియం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రెండు మూడు నెలల్లో ఈ ఆయుధాలు ఎస్పిజి కమెండోలకు అం దుబాటులోకి రానున్నాయని సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







