రూ.100కోట్లతో ప్రముఖుల భద్రతకు బెల్జియం ఆయుధాలు
- October 28, 2018
ప్రముఖుల భద్రత కోసం బెల్జియం దేశానికి చెందిన అధునాతన ఆయుధాల ను కొనుగోలు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులతో పాటు ఎస్పిజి రక్షణ లో వున్న వివిఐపిల కోసం త్వరలో ఈ ఆయుధాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం కేంద్రం వంద కోట్ల రూపాయలను వెచ్చించేందుకు నిర్ణయించింది. ప్రముఖుల భద్రత కల్పిస్తున్న ఎస్పిజి కమెండోల వద్ద ప్రస్తుతం గ్లాక్ పిస్ట ళ్లు, ఎంపి 5 సబ్ మెషిన్స్తో పాటు ఎకె 47, ఎకె 56 తుపాకులు వున్నాయి. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదంతో పాటు తీవ్ర వాద సమస్యలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖుల భద్రత కల్పించడం భద్రతా బలగాలకు సవాల్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బెల్జియం దేశానికి చెందిన ఎఫ్.ఎన్ పిస్టళ్లతో పాటు ఫైవ్ సెవన్ పి 90 సబ్ మిషిన్స్ తెప్పించేందుకు కేం ద్రం నిర్ణయించింది. ఈ ఆయుధాలను కొనుగోలు చేసేందుకు వంద కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఇప్పటికే బెల్జియం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. రెండు మూడు నెలల్లో ఈ ఆయుధాలు ఎస్పిజి కమెండోలకు అం దుబాటులోకి రానున్నాయని సమాచారం.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









