ప్రాస్టిట్యూషన్‌: 75 మందికి పైగా అరెస్ట్‌

- October 30, 2018 , by Maagulf
ప్రాస్టిట్యూషన్‌: 75 మందికి పైగా అరెస్ట్‌

మస్కట్‌: ప్రాస్టిట్యూషన్‌ కేసులో 77 మంది మహిళల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. వీరిలో 66 మంది మహిళలు ఆసియా జాతీయులు కాగా, ఏడుగురు ఆఫ్రికన్‌ జాతీయులు, మరో నలుగురు ఆసియా జాతీయుల్ని ఈ వ్యభిచార కార్యకలాపాలతో సంబంధం వుందన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్‌ చేయడం జరిగింది. మస్కట్‌ గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, స్పెసల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమాండ్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో వీరిని అరెస్ట్‌ చేశారు. రెసిడెన్స్‌ లా ఫర్‌ ఫారినర్స్‌ని ఉల్లంఘించినట్లుగా కూడా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. అరెస్ట్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌ ద్వారా చేసిన ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com