క్యాన్సర్ వాకథాన్లో ఇండియన్ అంబాసిడర్
- October 30, 2018
మస్కట్: 8000 మందికి పైగా పౌరులు, రెసిడెంట్స్ యాన్యువల్ క్యాన్సర్ వాక్లో పాల్గొన్నారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్, క్యాన్సర్ పట్ల అవగాహన పెంచే క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వరుసగా 15వ ఏడాది ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కుర్రుమ్ నేషనల్ పార్క్ వద్ద అక్టోబర్ 30న జరిగిన ఈ కార్యక్రమంలో భారత అంబాసిడర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొని, క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాకథాన్లో 8,500 మంది వరకూ పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారత రాయబారి మును మహావర్, ఎంబసీకి చెందిన పలువురు అధికారులతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ నిర్వహించిన పింక్ రిబ్బన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, మస్కట్లోని పలు ప్రాంతాల్లోనూ జరిగింది. మాల్స్కి వచ్చే విజిటర్స్కి క్యాన్సర్ పట్ల అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపట్టారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







