కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్, 25 మంది మృతి
- October 31, 2018
అఫ్గానిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఫరా ప్రావిన్స్లో ఓ సైనిక విమానం కుప్పకూలి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఫరా ప్రావిన్స్లోని అనార్ దరా జిల్లా నుంచి హెరత్ ప్రావెన్స్కు బయల్దేరిన ఓ సైనిక విమానం బుధవారం ఉదయం 9.10 గంటల సమయంలో కూలిపోయింది. అనార్ దరా బేస్ నుంచి విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో విమానంలో '207 జాఫర్ మిలిటరీ కార్ప్స్' అధికారులతో పాటు ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యులు మొత్తం 25 మంది ఉన్నారు. ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని జాఫర్ మిలిటరీ కార్ప్స్ అధికార ప్రతినిధి నజీబుల్లా నజీబీ తెలిపారు. మృతుల్లో ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ చీఫ్ ఫరీద్ భక్తావర్, 207 జాఫర్ మిలిటరీ కార్ప్స్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ నెమతుల్లా ఖలీల్ కూడా ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







