పాక్ లో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి
- October 31, 2018పాకిస్థాన్లో క్రైస్తవ మహిళ ఆసియా బీబీ మరణశిక్ష నుంచి విముక్తి పొందింది. దైవ దూషణకు పాల్పడిన కేసులో .. గతంలో లాహోర్ కోర్టు ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. అయితే ఇవాళ పాకిస్థాన్ సుప్రీంకోర్టు.. ఆసియా బీబీ అభ్యర్థనను స్వీకరించింది. ఆమెకు ఈ కేసులో ప్రాణ విముక్తి కల్పిస్తున్నట్లు సీజేపీ తెలిపారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ మియాన్ సాకిబ్ నిసార్తో పాటు జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా, జస్టిస్ మజ్హర్ ఆలమ్ ఖాన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దైవాన్ని దూషించిన ఘటనలో 2009లో ఆసియా బీబీపై కేసు నమోదు అయ్యింది. ఓ ట్రయల్ కోర్టు 2010 నవంబర్లో ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును లాహోర్ హైకోర్టు సమర్థించింది. అయితే ఆ రెండు తీర్పులను రద్దు చేస్తున్నట్లు ఇవాళ సీజేపీ తెలిపారు. ఆసియా బీబీని తక్షణమే రిలీజ్ చేయాలని ఆయన తన తీర్పులో ఆదేశించారు. మొత్తం 56 పేజీల తీర్పును తయారు చేశారు. ఈ కేసులో ఆసియా ఇప్పటికే 8 ఏళ్ల జైలు శిక్షను అనుభవించింది. మహ్మద్ ప్రవక్తను అవమానించినట్లు ఆసియాపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..