పాక్ లో క్రైస్తవ మహిళకు మరణశిక్ష నుంచి విముక్తి
- October 31, 2018
పాకిస్థాన్లో క్రైస్తవ మహిళ ఆసియా బీబీ మరణశిక్ష నుంచి విముక్తి పొందింది. దైవ దూషణకు పాల్పడిన కేసులో .. గతంలో లాహోర్ కోర్టు ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. అయితే ఇవాళ పాకిస్థాన్ సుప్రీంకోర్టు.. ఆసియా బీబీ అభ్యర్థనను స్వీకరించింది. ఆమెకు ఈ కేసులో ప్రాణ విముక్తి కల్పిస్తున్నట్లు సీజేపీ తెలిపారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్థాన్ మియాన్ సాకిబ్ నిసార్తో పాటు జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా, జస్టిస్ మజ్హర్ ఆలమ్ ఖాన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దైవాన్ని దూషించిన ఘటనలో 2009లో ఆసియా బీబీపై కేసు నమోదు అయ్యింది. ఓ ట్రయల్ కోర్టు 2010 నవంబర్లో ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. ఆ తీర్పును లాహోర్ హైకోర్టు సమర్థించింది. అయితే ఆ రెండు తీర్పులను రద్దు చేస్తున్నట్లు ఇవాళ సీజేపీ తెలిపారు. ఆసియా బీబీని తక్షణమే రిలీజ్ చేయాలని ఆయన తన తీర్పులో ఆదేశించారు. మొత్తం 56 పేజీల తీర్పును తయారు చేశారు. ఈ కేసులో ఆసియా ఇప్పటికే 8 ఏళ్ల జైలు శిక్షను అనుభవించింది. మహ్మద్ ప్రవక్తను అవమానించినట్లు ఆసియాపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







