37వ షార్జా అంతర్జాతీయ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభం

- October 31, 2018 , by Maagulf
37వ షార్జా అంతర్జాతీయ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభం

షార్జా:37వ ఎడిషన్‌ షార్జా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ (ఎస్‌ఐబిఎఫ్‌) బుధవారం ప్రారంభమయ్యింది. సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌, షార్జా రూలర్‌డాక్టర్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖాసిమి ప్రారంభించారు. షార్జా డిప్యూటీ రూలర్‌, క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ కాసిమి, షార్జా రూలర్‌ భార్య, సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఎఫైర్స్‌ ఛెయిర్‌ పర్సన్‌ షేకా జవహర్‌ బింట్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షార్జా బుక్‌ అథారిటీ ఈ బుక్‌ ఫెయిర్‌ని 'టేల్‌ ఆఫ్‌ లెటర్స్‌' థీమ్‌తో నిర్వహిస్తోంది. నంబర్‌ 10 వరకు ఎక్స్‌పో సెంటర్‌ షార్జాలో ఈ ఫెయిర్‌ కొనసాగుతుంది. పలువురు షేక్‌లు, మినిస్టర్స్‌, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో పబ్లిషర్స్‌, ఇంటలెక్చువల్స్‌, మీడియా ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com