ఇరాన్ లో నిరసన..జైలు పాలైన కార్మికులు
- October 31, 2018
టెహ్రాన్: వేతన బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులోకి నెట్టటాన్ని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గత వేసవిలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో కార్మికులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెవీ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ కంపెనీ (హెప్కో)కు చెందిన వారని, గత ఏడాది సెప్టెంబర్లో ఈ కంపెనీ ప్రైవేటు పరం కావటంతో వీరంతా తమ వేతన బకాయిల కోసం ఆందోళన చేశారని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తుడే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నవీద్ షొమాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న 15 మంది హెప్కో కార్మికులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయటం అమానుషమని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దయెత్తున ఐక్యపోరాటాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఆయన ఇరాన్ కార్మికలోకానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







