ఇరాన్ లో నిరసన..జైలు పాలైన కార్మికులు
- October 31, 2018టెహ్రాన్: వేతన బకాయిల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి జైలులోకి నెట్టటాన్ని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గత వేసవిలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో కార్మికులు పాల్గొన్నారు. ఈ ఆందోళనలో పాల్గొన్న కార్మికులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని హెవీ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ కంపెనీ (హెప్కో)కు చెందిన వారని, గత ఏడాది సెప్టెంబర్లో ఈ కంపెనీ ప్రైవేటు పరం కావటంతో వీరంతా తమ వేతన బకాయిల కోసం ఆందోళన చేశారని ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ తుడే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నవీద్ షొమాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనలో పాల్గొన్న 15 మంది హెప్కో కార్మికులకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయటం అమానుషమని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్దయెత్తున ఐక్యపోరాటాలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని ఆయన ఇరాన్ కార్మికలోకానికి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు