బీబీకి స్వేచ్ఛ..మరణశిక్షను రద్దు
- October 31, 2018ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళ ఆసియా బీబీకు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించడంతో మతచాంధసవాదులు ఆందోళన చేపట్టారు. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీతో పాటు ఇతర నగరాల్లోనూ నిరసనకారులు రహదారులను అడ్డుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఆందోళనకారులు మూసివేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చినా.. ఆందోళనకారులు రెండవ రోజు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయ లబ్ది కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని, నిరసనకారులు ఇస్లాం మతానికి సేవ చేయడం లేదని ఇమ్రాన్ తన సందేశంలో అన్నారు. మహ్మాద్ ప్రవక్తను అవమానపరిచాన్న కేసులో ఆసియా బీబీని అరెస్టు చేశారు. 2010లో నమోదైన కేసులో ఆమెకు మరణశిక్షను ఖరారు చేశారు. అయితే ఆమె అభ్యర్థనను స్వీకరించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు .. బధవారం ఆసియా బీబీకి స్వేచ్ఛను ప్రసాదిస్తూ మరణశిక్షను రద్దు చేసింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు