141 మంది వలస కార్మికుల అరెస్ట్
- November 01, 2018ఒమన్:మొత్తం 141 మంది వలస కార్మికుల్ని గురువారం అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ వెల్లడించింది. డాన్లో వీరిని అరెస్ట్ చేశారు. వలస కార్మికులు, లేబర్ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఈ అరెస్టులు జరిగాయి. మినిస్ట్రీ, రాయల్ ఒమన్ పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల్ని ఉల్లంఘించిన వలస కార్మికుల్ని అరెస్ట్ చేశారు. జుఫ్నైన్, అల్ సీబ్ ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. అరెస్ట్ చేసినవారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నారు. అరెస్ట్ చేసినవారంతా ఆసియా జాతీయులేనని అధికారులు పేర్కొన్నారు. వీరంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు