బీబీకి స్వేచ్ఛ..మరణశిక్షను రద్దు
- October 31, 2018
ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళ ఆసియా బీబీకు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించడంతో మతచాంధసవాదులు ఆందోళన చేపట్టారు. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీతో పాటు ఇతర నగరాల్లోనూ నిరసనకారులు రహదారులను అడ్డుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఆందోళనకారులు మూసివేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చినా.. ఆందోళనకారులు రెండవ రోజు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయ లబ్ది కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని, నిరసనకారులు ఇస్లాం మతానికి సేవ చేయడం లేదని ఇమ్రాన్ తన సందేశంలో అన్నారు. మహ్మాద్ ప్రవక్తను అవమానపరిచాన్న కేసులో ఆసియా బీబీని అరెస్టు చేశారు. 2010లో నమోదైన కేసులో ఆమెకు మరణశిక్షను ఖరారు చేశారు. అయితే ఆమె అభ్యర్థనను స్వీకరించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు .. బధవారం ఆసియా బీబీకి స్వేచ్ఛను ప్రసాదిస్తూ మరణశిక్షను రద్దు చేసింది.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







