బీబీకి స్వేచ్ఛ..మరణశిక్షను రద్దు
- October 31, 2018
ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్తంభించిపోయింది. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. దైవ దూషణ కేసులో క్రైస్తవ మహిళ ఆసియా బీబీకు మరణశిక్ష నుంచి విముక్తి కల్పించడంతో మతచాంధసవాదులు ఆందోళన చేపట్టారు. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీతో పాటు ఇతర నగరాల్లోనూ నిరసనకారులు రహదారులను అడ్డుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఆందోళనకారులు మూసివేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చినా.. ఆందోళనకారులు రెండవ రోజు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయ లబ్ది కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని, నిరసనకారులు ఇస్లాం మతానికి సేవ చేయడం లేదని ఇమ్రాన్ తన సందేశంలో అన్నారు. మహ్మాద్ ప్రవక్తను అవమానపరిచాన్న కేసులో ఆసియా బీబీని అరెస్టు చేశారు. 2010లో నమోదైన కేసులో ఆమెకు మరణశిక్షను ఖరారు చేశారు. అయితే ఆమె అభ్యర్థనను స్వీకరించిన పాకిస్థాన్ సుప్రీంకోర్టు .. బధవారం ఆసియా బీబీకి స్వేచ్ఛను ప్రసాదిస్తూ మరణశిక్షను రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







