బ్రేకింగ్.. భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామం..
- November 01, 2018
ఢిల్లీ:భారత దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోడీ వ్యతిరేక కూటమి కోసం పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నంలో ఉన్న సీఎం చంద్రబాబు.. టీడీపీ పుట్టుకతోనే కాంగ్రెస్తో ఉన్న వైరాన్ని పక్కనపెట్టి.. రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ కీలక భేటీ.. దేశ రాజకీయాల్ని ఆకర్షిస్తోంది.
ప్రధానంగా రాహుల్-చంద్రబాబు భేటీలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు వెంట ఎంపీలు జయదేవ్…కనకమేడల, సీఎం రమేష్, కంభంపాటి ఉండగా.. భేటీలో రాహుల్తో పాటు కొప్పుల రాజు, అహ్మద్ పటేల్ ఉన్నారు.
అటు.. ప్రత్యామ్నాయ కూటమిపై వివిధ పార్టీలతో చంద్రబాబు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్తోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







