రోడ్డు ప్రమాద బాధితుడికి ఎంబసీ సాయం
- November 02, 2018
అబుదాబీ:అబుదాబీలో ఇండియన్ ఎంబసీ అధికారులు, రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్ర గాయాల పాలై కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఖాదెర్ మొహమ్మద్ అద్నాన్ అనే కేరళ వాసికి అండగా నిలిచారు. సెప్టెంబర్ 29 నుంచి అద్నాన్ ముఫ్రాక్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నాడు. కదల్లేని పరిస్థితుల్లో వున్న అద్నాన్, అమ్నెస్టీని వినియోగించుకోవడమెలాగో తెలియక ఆందోళన చెందుతుండగా, అతనికి ఎంబసీ అండగా నిలిచింది. ఇండియన్ ఎంబసీ నుంచి తొలుత ఫోన్ రాగానే ఆశ్చర్యపోయానని ఎంబసీ అధికారులు కలిసిన అనంతరం అద్నాన్ చెప్పాడు. ఎంబసీ, తనకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చిందనీ, అలాగే ఇండియాకి వెళ్ళేందుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిందని అన్నాడు అద్నాన్. రోడ్డు ప్రమాదం కారణంగా అద్నాన్కి పలు రకాలైన శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందనీ, శరీరంలో కొన్ని చోట్ల స్టీల్ రాడ్స్ అమర్చామనీ వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







