ఎంట్రీ వీసాలు ఉన్నాఅనుమతి లేదు..
- December 21, 2015
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్రయత్నించి వీసాలు కూడా పొందిన హైదరాబాద్ విద్యార్థులకు చివరి నిమిషంలో ఊహించని పరిణామం ఎదురైంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలి, నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన 19 మంది విద్యార్ధులు అక్కడికి చేరుకోవడానికి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఈ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్ లో ఉంచారనే కారణంతో ఎయిర్ ఇండియా అధికారులు వీరికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల ప్రయాణ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు చెప్పారు. అయితే తమకు అన్ని రకాల అనుమతులు సక్రమంగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. తమకు అమెరికా కాన్సులేట్ వీసా జారీ చేసిన తరువాత ఎయిర్ పోర్టు అధికారులు ఇలాంటి కారణాలు చూపించడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఎంట్రీ వీసాలు ఉన్నందున మరో విమాన సంస్థ ద్వారానైనా అక్కడకు చేరుకుంటామంటున్నారు. తాము అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలకు అక్రిడిటేషన్ ఉండని, గతంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లారని అంటున్నారు. నార్త్వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి 2016 వరకు అనుమతులు ఉన్నాయనీ అయినా కూడా అధికారులు అడ్డుకోవడమేంటి అని ఆ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని యూనివర్సిటీ వర్గాలు కూడా దృవీకరించాయి. పారిస్ దాడుల నేపథ్యంలో అమెరికా చేపడుతున్న భద్రతా చర్యల దృష్ట్యా ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై అమెరికన్ కాన్సులేట్ స్పందించడానికి నిరాకరించింది.
తాజా వార్తలు
- ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- భారతదేశంలో వేలాది వాట్సాప్ ఖాతాలపై 24 గంటల నిషేధం
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!







