అమెరికాలో హెచ్-1బీ వీసాల కుంభకోణం.!
- November 03, 2018
హెచ్-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తిని అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులను నిలువరించేందుకు వీసా నిబంధనలను జారీని మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన కావూరు కిష్ర్కుమార్ (46).. వీసాల కుంభకోణానికి తెర లేపాడు. 2007 నుంచి నాలుగు కన్సల్టింగ్ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్న కిషోర్.. పలు కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను నియమించే అంశంలో వీసా మోసాలు, మెయిల్ మోసాలు చేసినట్లు అధికారులు అభియోగాలు నమోదు చేశారు. అభ్యర్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ వీసా నిబంధనలను అతిక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలోనే ఆయణ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీసాల కేసులో కిషోర్ దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష, అత్యధికంగా 2,50,000డాలర్ల జరిమానా పడుతుంది. ఇ-మెయిల్ మోసంలో దోషిగా తేలితే 20ఏళ్ల జైలు శిక్ష పడనుంది.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచ కప్: రికార్డు స్థాయిలో రూ.81 కోట్ల ప్రైజ్ మనీ!
- ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్...
- యూఏఈ అధ్యక్షుడు–బహ్రెయిన్ రాజు భేటీ..
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!









