అమెరికాలో హెచ్-1బీ వీసాల కుంభకోణం.!
- November 03, 2018
హెచ్-1బీ వీసా మోసం కేసులో భారత సంతతి వ్యక్తిని అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగులను నిలువరించేందుకు వీసా నిబంధనలను జారీని మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన కావూరు కిష్ర్కుమార్ (46).. వీసాల కుంభకోణానికి తెర లేపాడు. 2007 నుంచి నాలుగు కన్సల్టింగ్ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తున్న కిషోర్.. పలు కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను నియమించే అంశంలో వీసా మోసాలు, మెయిల్ మోసాలు చేసినట్లు అధికారులు అభియోగాలు నమోదు చేశారు. అభ్యర్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ వీసా నిబంధనలను అతిక్రమించినట్లు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలోనే ఆయణ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వీసాల కేసులో కిషోర్ దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష, అత్యధికంగా 2,50,000డాలర్ల జరిమానా పడుతుంది. ఇ-మెయిల్ మోసంలో దోషిగా తేలితే 20ఏళ్ల జైలు శిక్ష పడనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







