పండక్కి పతంజలి జీన్స్.. 25% డిస్కౌంట్..
- November 05, 2018ఈ దీపావళి పండుగను పతంజలి వస్త్రాలు ధరించి మరింత ఆనందంగా జరుపుకోమంటూ మార్కెట్లోకి తీసుకు వచ్చారు బాబా రాందేవ్. ఢిల్లీలో పతంజలి పరిధాన్ పేరిట యాక్సెసరీస్ స్టోర్ను సోమవారం ప్రారంభించారు. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ వస్త్రాలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని స్టోర్లు ఏర్పాటు చేసి అందరికి అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారుల అభిరుచులకు తగ్గట్లు ఇక్కడ దుస్తులు లభ్యమవుతాయి. ఇంకా పండగ సీజన్ని పురస్కరించుకుని 25 శాతం డిస్కౌంట్తో దుస్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జీన్స్ రూ.500, బ్రాండెడ్ షర్ట్ రూ.500 కే ఇస్తున్నట్లు తెలిపారు. 7వేల రూపాయల విలువ చేసే వస్త్రాలను రూ.1100లకే ఇస్తున్నట్లు తెలియజేశారు. పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలను నియంత్రించి స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించే దిశగా పతంజలి పరిధాన్ను తీసుకు వచ్చామని రాందేవ్ అంటున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు