అంతరిక్షంలోకి మరో యూఏఈ శాటిలైట్!
- November 07, 2018మైశాట్-1 పేరుతో యూఏఈకి చెందిన స్టూడెంట్స్ తయారు చేసిన నానో శాటిలైట్ ఈ నెలలోనే అంతరిక్షంలోకి వెళ్ళనుంది. గత నెలలో అంటే అక్టోబర్లో 29వ తేదీన దేశానికి చెందిన ఖలీఫా శాటిలైట్, జపాన్లోని ప్రయోగ కేంద్రం నుంచి ఆకాంశంలోకి దూసుకెళ్ళిన సంగతి తెల్సిందే. కాగా, 20 మంది విద్యార్థులు, మైశాట్-1 శాటిలైట్ని రూపొందించారు. ఖలీఫా యూనివర్సిటీకి చెందిన ఈ విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్, భూమిని ఫొటోలు తీయనుంది. ప్రధానంగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం దీన్ని రూపొందించారు. నార్త్ట్రాప్ గ్రుమ్నాన్ సంస్థ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మైశాట్-1 ఉపగ్రహాన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తారు. మైశాట్-1 బరువు 1.3 కిలోలు. మస్దార్ సిటీలోని యహ్శాట్ స్పేస్ ల్యాబ్లో దీన్ని రూపొందించారు. మస్దార్ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన బ్యాటరీతోపాటు, కెమెరా ఇందులోని ప్రధాన భాగాలు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు