23 మంది ఆసియా వర్కర్లను రక్షించిన దుబాయ్ పోలీసులు
- December 21, 2015
ఓ బస్సులో 12 రోజులపాటు ఆహారం, మంచి నీళ్ళు లేకుండా దీనావస్థలో ఇబ్బందిపడుతున్న 23 మంది ఆసియాకి చెందిన కార్మికులకు విముక్తి కల్పించారు దుబాయ్ పోలీసులు. కస్ర్ అల్ అమీర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ అజ్ఞతంలోకి వెళ్ళిపోవడంతో, ఆ కంపెనీలో పనికోసం కుదిరిన 23 మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఓ బస్సులో రెండు వారాల పాటు మగ్గిపోతున్న వారిని పోలీసులు, శిబిరాలకు తరలించారు. నెలకి 1000 దిర్హామ్లు చెల్లించేలా కార్మికులు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా, సెప్టెంబర్ నుంచి వారికి వేతనాలు చెల్లించలేదు కన్స్ట్రక్షన్ కంపెనీ. దాంతో, అక్కడి నుంచి బస్సులోకి ఆ కుటుంబాలు షిఫ్ట్ అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తూ, పార్కింగ్ స్థలాల్లో బస్ని పార్క్ చేసి, అక్కడే బస్సులో ఇరుక్కుపోయి, అత్యంత దారుణ పరిస్థితుల్లో రెండు వారాల పాటు జీవనం గడిపారు బాధితులు. బస్ డ్రైవర్ తమకు సహకరించారని బాధితులు చెప్పారు. బస్ డ్రైవర్ ఏడేళ్ళుగా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బాధితులకు అవసరమైన న్యాయసహాయం అందించడంతోపాటు, వారికి ఆహారం అందిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం వారికి పాస్పోర్ట్లు కూడా అందాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







