దుబాయ్ లో మెగా రక్త దాన శిబిరం...
- November 10, 2018దుబాయ్:47వ యూ.ఏ.ఈ నేషనల్ దినోత్సవం సందర్భంగా ఎఫ్.ఓ.ఐ ఈవెంట్స్ ఆధ్వర్యంలో దుబాయ్ లో మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ శిబిరం కు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల వలస కార్మికులు రక్త దానం చేయడం కోసం ముందుకొచ్చారు.ఈ సందర్బం గా మన తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా రాంపూర్ కు చెందిన వలస కార్మికుడి తో మా ప్రతినిధి ఈ రక్తదాన శిబిరం గురించి వివరణ కోరగా ఆయన మాటల్లో నేను ఒక్క సామాన్యుడిని నేను ఒక్క పేద ఇంటి నిరుద్యోగిని పొట్ట బట్టకయి కానరాని దేశంలో ఎడారి బాటలో నా జీవనం ప్రయాణం కొనసాగిస్తూ జీవితం వెళ్లదీస్తున్నకాలం గడిచి పోతుంది.నాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు కానుకలు ఇవ్వడానికి, ఉన్నదొకటే జిందగీ నా జిందగీలో ఒక్కరి ప్రాణం కాపాడటానికి నేను ఇవ్వగల నా ఆస్తి నా రక్తం ఒక్కరి జీవితం ఒక్క కుటుంబములో వెలుగులు నింపడమే నా లక్ష్యం ఆ లక్ష్యంలో నేను ముందడుగు వేసి ఈ రోజు తో 6 వ సారి రక్తదానం చేసి ఎడారి దేశంలో రక్తదాతగా నిల్చిన సందర్భంగా జంగం బాలకిషన్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో ఆదుకోవడమే నా జీవిత గమనం అని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?