హైదరాబాదులో 'మహర్షి' కీలకమైన సన్నివేశాలు
- November 10, 2018
తన కెరియర్ లో 25వ చిత్రమైన మహర్షి సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండస్ట్రీ లో భారీ నిర్మాతలు అయిన దిల్ రాజు మరియు అశ్వినీ దత్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల యూఎస్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
సినిమాకి సంబంధించిన చాలా చిత్రీకరణ అమెరికాలో కానీ చేశాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రాముఖ్యమైన సన్నివేశాలు కొన్ని మిగిలి ఉండటంతో హైదరాబాద్ నగరంలో పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్లు సమాచారం.
సినిమాకు సంబంధించిన కీలకమైన ఈ సన్నివేశాలలో అల్లరి నరేశ్ .. పూజా హెగ్డే నటిస్తున్నారట. డిసెంబర్లో జరిగే పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తికానుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఏఫ్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
వేసవి కానుకగా విడుదల కాబోతున్న 'మహర్షి' సినిమా పై భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. మహేష్ విడుదల అయిన చివరి సినిమా 'భరత్ అనే నేను' ఇండస్ట్రీ హిట్ అవడంతో..రాబోతున్న 'మహర్షి' కూడా అదే స్థాయిలో హిట్టు కొడుతుందని తమ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







