హైదరాబాదులో 'మహర్షి' కీలకమైన సన్నివేశాలు
- November 10, 2018
తన కెరియర్ లో 25వ చిత్రమైన మహర్షి సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండస్ట్రీ లో భారీ నిర్మాతలు అయిన దిల్ రాజు మరియు అశ్వినీ దత్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల యూఎస్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
సినిమాకి సంబంధించిన చాలా చిత్రీకరణ అమెరికాలో కానీ చేశాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రాముఖ్యమైన సన్నివేశాలు కొన్ని మిగిలి ఉండటంతో హైదరాబాద్ నగరంలో పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించడానికి సినిమా యూనిట్ సిద్ధమైనట్లు సమాచారం.
సినిమాకు సంబంధించిన కీలకమైన ఈ సన్నివేశాలలో అల్లరి నరేశ్ .. పూజా హెగ్డే నటిస్తున్నారట. డిసెంబర్లో జరిగే పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తికానుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఏఫ్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
వేసవి కానుకగా విడుదల కాబోతున్న 'మహర్షి' సినిమా పై భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. మహేష్ విడుదల అయిన చివరి సినిమా 'భరత్ అనే నేను' ఇండస్ట్రీ హిట్ అవడంతో..రాబోతున్న 'మహర్షి' కూడా అదే స్థాయిలో హిట్టు కొడుతుందని తమ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు మహేష్ అభిమానులు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







