ఆర్.ఆర్.ఆర్ ఓపెనింగ్..
- November 11, 2018
హైదరాబాద్:బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈరోజు ముహుర్త కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్ నాడే సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు రాజమౌళి.
చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి క్లాప్ కొట్టగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఇక ఓపెనింగ్ ఈవెంట్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ కూడా అటెండ్ అవడం విశేషం. ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
ఇక ఓపెనింగ్ లో మరో సర్ ప్రైజ్ ఏంటంటే బాహుబలి ప్రభాస్, భళ్లాలదేవ రానా ఈ ఈవెంట్ కు ఎంట్రీ ఇచ్చారు. బాహుబలి సినిమాతో రాజమౌళి, ప్రభాస్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ రాజమౌళి కోసం ఈ ఈవెంట్ కు వచ్చాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్, రానా నలుగురు స్టార్స్ ఒకే చోట్ల కలిసి తమ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఇక ముహుర్త కార్యక్రమానికి ప్రభాస్, రానా రావడంపై ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడన్న వార్తలు మొదలయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ అంటే రామ రావణ రాజ్యం అనే టైటిల్ కూడా ప్రచారం జరుగుతుంది. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్న ఈ ట్రిపుల్ ఆర్ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







