సోషల్ మీడియా అకౌంట్స్పై దుబాయ్ పోలీస్ వార్నింగ్
- November 12, 2018
ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తనను తాను ప్రముఖుడిగా పరిచయం చేసుకుని, ఓ వృద్ధురాలి నుంచి డబ్బుని లాగేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయనీ, సోషల్ మీడియాలో ఇలాంటి అపరిచిత వ్యక్తుల్ని నమ్మి మోసపోకూడదని దుబాయ్ పోలీస్ అప్రమత్తం చేసింది. స్కామర్స్కి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడ్తోందనీ, అపరిచిత వ్యక్తులు చెప్పే తియ్యటి మాటలు అమాయకుల్ని నిండా ముంచేస్తున్నాయని పోలీసులు చెప్పారు. అపరిచిత వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో కనుగొనగానే తమను సంప్రదించాలని దుబాయ్ పోలీసులు అంటున్నారు. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలీమ్ బిన్ సల్మీన్ మాట్లాడుతూ, సోషల్ మీడియా వినియోగదారులు అనుక్షణం అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగరాదనీ, పోలీసులను సంప్రదించి అక్రమార్కుల సమాచారం తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









