సోషల్ మీడియా అకౌంట్స్పై దుబాయ్ పోలీస్ వార్నింగ్
- November 12, 2018
ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తనను తాను ప్రముఖుడిగా పరిచయం చేసుకుని, ఓ వృద్ధురాలి నుంచి డబ్బుని లాగేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయనీ, సోషల్ మీడియాలో ఇలాంటి అపరిచిత వ్యక్తుల్ని నమ్మి మోసపోకూడదని దుబాయ్ పోలీస్ అప్రమత్తం చేసింది. స్కామర్స్కి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడ్తోందనీ, అపరిచిత వ్యక్తులు చెప్పే తియ్యటి మాటలు అమాయకుల్ని నిండా ముంచేస్తున్నాయని పోలీసులు చెప్పారు. అపరిచిత వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో కనుగొనగానే తమను సంప్రదించాలని దుబాయ్ పోలీసులు అంటున్నారు. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలీమ్ బిన్ సల్మీన్ మాట్లాడుతూ, సోషల్ మీడియా వినియోగదారులు అనుక్షణం అప్రమత్తంగా వుండాలని సూచించారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగరాదనీ, పోలీసులను సంప్రదించి అక్రమార్కుల సమాచారం తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!







