ఇంటర్ అర్హతతో ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు..
- November 13, 2018
ఏపీ పోలీస్ శాఖలో 2723 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్మెన్, వార్డర్స్ కేటగిరిలో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన విద్యార్హత
వయసు: 2018 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: డిసెంబరు 7
ప్రిలిమినరీ రాత పరీక్ష: జనవరి 6. ఈ పరీక్ష పాసైన వారికి రెండో వారంలో దేహ దారుడ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్చినెల మొదటి వారంలో తుది రాత పరీక్ష నిర్వహిస్తామని డీజీపీ ఠాకూర్ వెల్లడించారు.
ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు, తుది రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
గతంలో ముందు దేహదారుడ్య పరీక్ష్నిర్వహించేవారు. తాజా సవరణల ప్రకారం తొలుత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. మళ్లీ కొత్తగా 5 కిలోమీటర్ల రన్నింగ్ రద్దు, క్వాలిఫయింగ్ ఈవెంట్స్ను 5 నుంచి మూడింటికి పరిమితం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







