ఇంటర్ అర్హతతో ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు..
- November 13, 2018
ఏపీ పోలీస్ శాఖలో 2723 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్మెన్, వార్డర్స్ కేటగిరిలో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన విద్యార్హత
వయసు: 2018 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: డిసెంబరు 7
ప్రిలిమినరీ రాత పరీక్ష: జనవరి 6. ఈ పరీక్ష పాసైన వారికి రెండో వారంలో దేహ దారుడ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్చినెల మొదటి వారంలో తుది రాత పరీక్ష నిర్వహిస్తామని డీజీపీ ఠాకూర్ వెల్లడించారు.
ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు, తుది రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
గతంలో ముందు దేహదారుడ్య పరీక్ష్నిర్వహించేవారు. తాజా సవరణల ప్రకారం తొలుత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. మళ్లీ కొత్తగా 5 కిలోమీటర్ల రన్నింగ్ రద్దు, క్వాలిఫయింగ్ ఈవెంట్స్ను 5 నుంచి మూడింటికి పరిమితం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







