ఒకేసారి 15 మొబైల్స్లో...
- November 14, 2018
చైనా:రామ,కృష్ణ అని కూర్చొని భజన చేసుకునే టైంలో ఓ తైవాన్ తాత అద్భుతం సృష్టించాడు. ప్రపంచాన్ని ఔరా అనిపించేలా చేశాడు. సైకిల్కు 15 మెుబైల్స్ను పెట్టి వివాదస్పద పోకేమెన్ గో గేమ్ ఆడుతూ చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాడు.స్మార్ట్ ఫోన్ ఆధారితమైన ఈ గేమ్లో యానిమేటెడ్ పాత్రలను పట్టుకోవడం ఆటలో ఓ భాగం. పెద్దాయన సైకిల్పై తిరుగుతూగేమ్ రౌండ్లను సునాయాసంగా పూర్తి చేస్తున్నాడు. యుక్త వయస్కులకే కష్టమైన ఈ ఆటను 70 ఏళ్ల తాత సైకిల్పై 15 మెుబైల్స్ పెట్టుకుని గేమ్ ఆడుతూ అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పెన్షనర్ అయిన ఆ తాత పేరు సాన్ యూయాన్. 15 మొబైల్స్ను పెట్టుకునే విధంగా సైకిల్ హ్యాండిల్ తయారు చేసి.. సైకిల్కు మొబైల్స్కు బ్యాటరీ బ్యాకప్ని అమర్చుకొని నగరమంతా తిరుగుతూ గేమ్ ఆడుతున్నాడు.
ఈ తాత తైవాన్లో సెలబ్రెటిగా మారిపోయాడు. పోకేమెన్ గో తాతగా ఫేమస్ అయ్యాడు.ఒక్క ఫోన్తో మొదలైన తన ఆట.. నెల తిరిగేసరికి మూడు, ఆ తరువాత ఆరు, తొమ్మిది నుంచి 15కు చేరిందని ఈ తైవాన్ తాత రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 2016లో ఈ గేమ్ తన మనవడు తనకు చూపించాడని ఈ క్రెడిట్ అంతా అతనిదేనని చెప్పుకొచ్చాడు. ప్రాణాంతకమైన ఈ పోకేమెన్ గో గేమ్ను పలు దేశాలు నిషేధించాయి. గేమ్లో భాగంగా ఇందులోని అదృశ్య పాత్రలను పట్టుకోవడం కోసం ఎతైన భవనాలు,కొండలపైకి, రోడ్లపైకి వెళ్ళి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







