లక్ష రూపాయలు ఇస్తేనే శవాన్ని ఇస్తానన్న ఆశుపత్రి సిబ్బంది
- December 22, 2015
భాగ్యనగరంలో ఠాగూర్ సినిమా సీన్ కనిపించింది! ఓ ఆసుపత్రి యాజమాన్యం మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఆమె పశ్చిమ బెంగాల్కు చెందిన మోమితగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తన భర్త ఆరోగ్యం కోసం ఆసుపత్రికి రూ.5 లక్షలు కట్టానని, మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని భార్య ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ డబ్బు కట్టలేక ఆమె హెచ్చార్సీని ఆశ్రయించింది. బాధితురాలు తన భర్తకు జైపూర్లో చికిత్స చేయించారు. అక్కడ పూర్తిగా నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకు వచ్చారు. నాలుగు రోజుల క్రితం అతను చనిపోయాడు. అప్పటికే ఆమె రూ.5 లక్షలు చెల్లించినట్లుగా చెబుతోంది. ఇప్పుడు అతను చనిపోయాక కూడా మరో రూ.1లక్ష అడుగుతున్నారని చెబుతోంది. తమది ప్రేమ వివాహం అని, బంధువులు లేరని, తాను స్నేహితుల వద్ద అప్పు చేసి ఆ మొత్తాన్ని కట్టానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త శవం కోసం ఆమె నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







