లక్ష రూపాయలు ఇస్తేనే శవాన్ని ఇస్తానన్న ఆశుపత్రి సిబ్బంది
- December 22, 2015
భాగ్యనగరంలో ఠాగూర్ సినిమా సీన్ కనిపించింది! ఓ ఆసుపత్రి యాజమాన్యం మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఆమె పశ్చిమ బెంగాల్కు చెందిన మోమితగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తన భర్త ఆరోగ్యం కోసం ఆసుపత్రికి రూ.5 లక్షలు కట్టానని, మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని భార్య ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ డబ్బు కట్టలేక ఆమె హెచ్చార్సీని ఆశ్రయించింది. బాధితురాలు తన భర్తకు జైపూర్లో చికిత్స చేయించారు. అక్కడ పూర్తిగా నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకు వచ్చారు. నాలుగు రోజుల క్రితం అతను చనిపోయాడు. అప్పటికే ఆమె రూ.5 లక్షలు చెల్లించినట్లుగా చెబుతోంది. ఇప్పుడు అతను చనిపోయాక కూడా మరో రూ.1లక్ష అడుగుతున్నారని చెబుతోంది. తమది ప్రేమ వివాహం అని, బంధువులు లేరని, తాను స్నేహితుల వద్ద అప్పు చేసి ఆ మొత్తాన్ని కట్టానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త శవం కోసం ఆమె నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









