లక్ష రూపాయలు ఇస్తేనే శవాన్ని ఇస్తానన్న ఆశుపత్రి సిబ్బంది

- December 22, 2015 , by Maagulf
లక్ష రూపాయలు ఇస్తేనే శవాన్ని ఇస్తానన్న ఆశుపత్రి సిబ్బంది

భాగ్యనగరంలో ఠాగూర్ సినిమా సీన్ కనిపించింది! ఓ ఆసుపత్రి యాజమాన్యం మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఆమె పశ్చిమ బెంగాల్కు చెందిన మోమితగా చెబుతున్నారు. ఇప్పటి వరకు తన భర్త ఆరోగ్యం కోసం ఆసుపత్రికి రూ.5 లక్షలు కట్టానని, మరో లక్ష రూపాయలు ఇస్తేనే తన భర్త శవాన్ని ఇస్తామని చెబుతున్నారని భార్య ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ డబ్బు కట్టలేక ఆమె హెచ్చార్సీని ఆశ్రయించింది. బాధితురాలు తన భర్తకు జైపూర్లో చికిత్స చేయించారు. అక్కడ పూర్తిగా నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకు వచ్చారు. నాలుగు రోజుల క్రితం అతను చనిపోయాడు. అప్పటికే ఆమె రూ.5 లక్షలు చెల్లించినట్లుగా చెబుతోంది. ఇప్పుడు అతను చనిపోయాక కూడా మరో రూ.1లక్ష అడుగుతున్నారని చెబుతోంది. తమది ప్రేమ వివాహం అని, బంధువులు లేరని, తాను స్నేహితుల వద్ద అప్పు చేసి ఆ మొత్తాన్ని కట్టానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త శవం కోసం ఆమె నాలుగు రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com