దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం వేచి చూస్తే అస్థి పంజరం అవుతారు!
- November 15, 2018
బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగింది. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది. వరుడు రణ్వీర్ సీప్లేన్లో మండపానికి వచ్చాడు. దీపిక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిందనట్టు తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో దీప్ రణ్ పెళ్లి ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఆ విషయం తెలియజేస్తూ.. ఆసక్తికరమైన ట్విట్ చేశారు స్మృతీ. 'దీప్వీర్ పెళ్లి ఫొటోల కోసం చాలా సేపటి వరకు ఎదురుచూసినప్పుడు ఇలాగే ఉంటుంది' అంటూ ఓ బల్లపై కూర్చున్న అస్తిపంజరం ఫోటోను పోస్టు చేశారు. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభమా అని పెళ్లి చేసుకొంటుంటే.. ఈ అస్థిపంజరం ఏంటీ మంత్రి గారూ.. !! అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









