బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న కేటీఆర్
- November 17, 2018
ముంబై: రాష్ట్ర సీఎం కేసీఆర్ను ఎకనామిక్ టైమ్స్ వారి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ అవార్డుల ప్రదానోత్సవం ముంబైలో జరిగింది. సీఎం కేసీఆర్కు వచ్చిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సీఎం కేసీఆర్ తరుపున మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును మంత్రి కేటీఆర్కు అందించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ తరుపున ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశంలో అత్యంత పిన్న వయసు గల తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులతో దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ అవార్డు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా మంత్రి అభివర్ణించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







