తెలుగు కళా సమితి 20వ వార్షిక వేడుకలు
- November 19, 2018
బహ్రెయిన్ తెలుగు కళా సమితి, 20వ వార్షిక ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. నవంబర్ 23న ఏసియన్ స్కూల్ - ఎపిజె అబ్దుల్ కలాం ఆడిటోరియం ఇందుకు వేదిక కానుంది. 'రంగస్థలం - ఆట పాట' పేరుతో ఈ మెగా షోని డిజైన్ చేశారు. భారతదేశం నుంచి పలువురు కళాకారులు, ఈ వేదికపై సందడి చేస్తారు. 2,500 మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సింగర్స్ మల్లికార్జున్, దామిని భట్ల, బిగ్బాస్ 2 తెలుగు ఫేం భానుశ్రీ, ఢీ డాన్స్ షో యశ్వంత్ ఈ డాన్స్ ఈవెంట్లో సందడి చేస్తారు. టికెఎస్ జనరల్ సెక్రెటరీ, ఈవెంట్ జనరల్ కన్వీనర్ ఎంబీ రెడ్డి మాట్లాడుతూ, ఈ షోని సూపర్ సక్సెస్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. టిక్కెట్స్, మెంబర్ పాస్ల కోసం గంగా సాయిని 36063322 నెంబర్లోనూ, అనిల్ పామిడిని 38829360 నెంబర్లోనూ సంప్రదించవచ్చు.
- ఎం.వాసుదేవ రావు, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







