ఇండియా:ఇంజిన్ లేని ట్రైన్.. ట్రైయిల్ రన్ సక్సెస్..
- November 19, 2018ఇండియా:పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్ రహిత రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ట్రైన్-18గా పేర్కొనే ఈరైలు మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరుగులు పెట్టింది. వివిధ స్థాయిల్లో రైలు వేగాన్ని, ట్రైన్ బ్రేక్ల పనితీరును పరిశీలించారు. ఈ రైలును మొదట మొరాదాబాద్-బరేలి మధ్య ట్రయల్ రన్ నిర్వహించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరీక్షించారు.
ఈ ట్రైన్ గంటకు 220 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదని అధికార వర్గాలు తెలిపాయి. 16 బోగీలతో ఉండే ఈ రైలులో దివ్వాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. డ్రైవర్ బోగీకి రెండు వైపుల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కదలికలు తెలుసుకోవడంతో పాటు ప్రమాదాలను నివారించడానికి ఈ కెమెరాలు ఉపయోగ పడతాయి.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..