విలన్ గా మారనున్న వరుణ్ తేజ్
- November 20, 2018ఈ మధ్య కాలంలో మన హీరోలకు నెగిటీవ్ పాత్రలపై మోజు మళ్లింది. `జై లవకుశ`లో ఎన్టీఆర్ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపించాడు. రాజమౌళి సినిమాలోనూ ఎన్టీఆర్ ప్రతినాయకుడే అనే టాక్ వినిపిస్తోంది. రానా, ఆది పినిశెట్టి లాంటి హీరోలు నెగిటీవ్ పాత్రలు చేశారు.. ఇంకా ఇంకా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వరుణ్తేజ్ కూడా నెగిటీవ్ పాత్రల వైపు దృష్టి సారించాడని సమాచారం. వరుణ్ తేజ్ కు తగిన పాత్ర కూడా దొరికింది. తమిళంలో ఘన విజయంసాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం 'జిగర్తాండ'. ఇందులో సిద్దార్థ్ కథానాయకుడిగా నటించినా.. పేరు మొత్తం ప్రతినాయకుడిగా కనిపించిన బాబీ సింహాకు వెళ్లింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కథానాయకుడి పాత్రని ఇంకాస్త డౌన్ చేసి, ప్రతినాయకుడి పాత్రకు మరింత హైప్ ఇవ్వాలని చూస్తున్నారట. ఆ పాత్రలో వరుణ్తేజ్ కనిపించనున్నాడని సమాచారం. 'జిగడ్తాండ' రైట్స్ దిల్రాజు దగ్గరే ఉన్నాయి. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ టేకప్ చేయనున్నాడని సమాచారం.
మరి సిద్దూ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారో, వరుణ్ తేజ్ ప్రతినాయక పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం