రీ-షూట్ కి పారితోషికం అడిగిన సాయిపల్లవి
- November 20, 2018హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా పడి పడి లేచె మనసు రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సుధాకర్ - ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రీ- షూట్ చేస్తున్నారు.
కొన్ని సీన్స్ మరింత బాగా రావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు రీ షూట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం సాయిపల్లవి డేట్స్ మళ్లీ అవసరమయ్యాయి. అయితే కొత్తగా ఇచ్చే డేట్స్ కి కూడా పారితోషికం ఇవ్వవలసిందేనని సాయిపల్లవి అడిగితే అందుకు నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా, కథ బాగోలేకపోతే సాయిపల్లవి నో చెప్పేస్తుంది. అలాంటింది ఈ సినిమా రీ-షూట్ కి పారితోషికం అడగడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ప్రతి విషయంలోను సాయిపల్లవి ఒక క్లారిటీతో ఉంటుందని అంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం