రీ-షూట్ కి పారితోషికం అడిగిన సాయిపల్లవి
- November 20, 2018
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా పడి పడి లేచె మనసు రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సుధాకర్ - ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని సీన్స్ రీ- షూట్ చేస్తున్నారు.
కొన్ని సీన్స్ మరింత బాగా రావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు రీ షూట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం సాయిపల్లవి డేట్స్ మళ్లీ అవసరమయ్యాయి. అయితే కొత్తగా ఇచ్చే డేట్స్ కి కూడా పారితోషికం ఇవ్వవలసిందేనని సాయిపల్లవి అడిగితే అందుకు నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా, కథ బాగోలేకపోతే సాయిపల్లవి నో చెప్పేస్తుంది. అలాంటింది ఈ సినిమా రీ-షూట్ కి పారితోషికం అడగడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ప్రతి విషయంలోను సాయిపల్లవి ఒక క్లారిటీతో ఉంటుందని అంటున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







