రైతు రుణాలు చెల్లించిన అమితాబ్
- November 21, 2018
ముంబై: ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు రైతులకు సంబంధించిన రుణాలను ప్రముఖ నటుడు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. మొత్తం 1398 మంది రైతులకు ఉన్న రుణాలను ఆయన బ్యాంకులకు కట్టేశారు. బ్యాంకుల నుంచి ఈవేురకు అందిన లేఖలను తీసుకోడానికి 70 మంది ఎంపిక చేసిన రైతులకు ప్రయాణ ఏర్పాట్లు కూడా తాను స్వయంగా చేసినట్లు సోమవారం అర్ధరాత్రి తర్వాత రాసిన బ్లాగ్ స్పాట్లో అమితాబ్ బచ్చన్ (76) తెలిపారు. గతంలో కూడా 350 మంది రైతుల కుటుంబాలకు వారి రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా అమితాబ్ సాయం చేశారు. కనీసం కొంతమంది రైతులకు ఉన్న కష్టాలను తీర్చగలిగినా ఎంతో సంతోషంగా ఉంటుందని, ఇంతకుముందు మహారాష్ట్రలోని 350 మంది రైతుల రుణాలు తీరిస్తే, ఇప్పుడు యూపీలో 1398 మంది రైతులకు ఉన్న రూ. 4.05 కోట్ల రుణాలు తీర్చగలిగానని అమితాబ్ తెలిపారు. ఇలాంటి బృహత్కార్యం తలపెట్టి, అది పూర్తి చేసినపుడు దానివల్ల కలిగే ఆత్మశాంతి అనిర్వచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









