రైతు రుణాలు చెల్లించిన అమితాబ్
- November 21, 2018ముంబై: ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు రైతులకు సంబంధించిన రుణాలను ప్రముఖ నటుడు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. మొత్తం 1398 మంది రైతులకు ఉన్న రుణాలను ఆయన బ్యాంకులకు కట్టేశారు. బ్యాంకుల నుంచి ఈవేురకు అందిన లేఖలను తీసుకోడానికి 70 మంది ఎంపిక చేసిన రైతులకు ప్రయాణ ఏర్పాట్లు కూడా తాను స్వయంగా చేసినట్లు సోమవారం అర్ధరాత్రి తర్వాత రాసిన బ్లాగ్ స్పాట్లో అమితాబ్ బచ్చన్ (76) తెలిపారు. గతంలో కూడా 350 మంది రైతుల కుటుంబాలకు వారి రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా అమితాబ్ సాయం చేశారు. కనీసం కొంతమంది రైతులకు ఉన్న కష్టాలను తీర్చగలిగినా ఎంతో సంతోషంగా ఉంటుందని, ఇంతకుముందు మహారాష్ట్రలోని 350 మంది రైతుల రుణాలు తీరిస్తే, ఇప్పుడు యూపీలో 1398 మంది రైతులకు ఉన్న రూ. 4.05 కోట్ల రుణాలు తీర్చగలిగానని అమితాబ్ తెలిపారు. ఇలాంటి బృహత్కార్యం తలపెట్టి, అది పూర్తి చేసినపుడు దానివల్ల కలిగే ఆత్మశాంతి అనిర్వచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు