రైతు రుణాలు చెల్లించిన అమితాబ్
- November 21, 2018
ముంబై: ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు రైతులకు సంబంధించిన రుణాలను ప్రముఖ నటుడు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీర్చేశారు. మొత్తం 1398 మంది రైతులకు ఉన్న రుణాలను ఆయన బ్యాంకులకు కట్టేశారు. బ్యాంకుల నుంచి ఈవేురకు అందిన లేఖలను తీసుకోడానికి 70 మంది ఎంపిక చేసిన రైతులకు ప్రయాణ ఏర్పాట్లు కూడా తాను స్వయంగా చేసినట్లు సోమవారం అర్ధరాత్రి తర్వాత రాసిన బ్లాగ్ స్పాట్లో అమితాబ్ బచ్చన్ (76) తెలిపారు. గతంలో కూడా 350 మంది రైతుల కుటుంబాలకు వారి రుణాలు తిరిగి చెల్లించడం ద్వారా అమితాబ్ సాయం చేశారు. కనీసం కొంతమంది రైతులకు ఉన్న కష్టాలను తీర్చగలిగినా ఎంతో సంతోషంగా ఉంటుందని, ఇంతకుముందు మహారాష్ట్రలోని 350 మంది రైతుల రుణాలు తీరిస్తే, ఇప్పుడు యూపీలో 1398 మంది రైతులకు ఉన్న రూ. 4.05 కోట్ల రుణాలు తీర్చగలిగానని అమితాబ్ తెలిపారు. ఇలాంటి బృహత్కార్యం తలపెట్టి, అది పూర్తి చేసినపుడు దానివల్ల కలిగే ఆత్మశాంతి అనిర్వచనీయమని అన్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







