'సుబ్రహ్మణ్యపురం' ట్రైలర్ విడుదల
- November 21, 2018
హైదరాబాద్: అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిన్మాలో సుమంత్ కు జోడీగా ఈషా రెబ్బా నటిస్తుంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను ట్విట్టర్ ద్వారా చిత్రయూనిట్ విడుదల చేసింది. నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా నటించిన సుమంత్.. భక్తి ముసుగులో జరిగే మోసాల్ని వెతికిపట్టే పనిలో పడ్డాడు. దేవుడంటే నమ్మకం లేని హీరో.. సుబ్రహ్మణ్యపురం అనే ఊరికోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అసలు దేవుడిని ఎందుకు ఎదిరించాడు? దేవుడి ముసుగులో ఉన్న దుష్టశక్తులు ఏంటి? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠత కలిగించే స్క్రీన్ ప్లే ఇందులో కనిపిస్తుంది. ఈ దేవాలయంలో ఏవైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్ అని సాయికుమార్ అడుగగా.. ఆ గుడిలో జరుగుతున్న మర్మాన్ని బయట పెడుతున్నాడు కార్తీక్.
మేమంతా ఆ భగవంతుడ్ని సెర్చ్ చేస్తాం..నువ్వేమో ఆ భగవంతుడిపైనే రీసెర్చ్ చేస్తున్నావ్ అని పూజారి పలికిన సంభాషనలతోపాటు, దేవుడి మహిమాౌలేక మానవుడి మేథస్సా చూద్దాం అంటూ సుమంత్ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రానికి హారర్, థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్ట్ శేఖర్చంద్ర సంగీతం అందిస్తున్నారు. హీరో సుమంత్ ఈ సినిమాతో మంచి విజయాన్నిఅందుకోవాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







