తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సోనియా గాంధీ
- November 22, 2018
తెలంగాణ:సోనియా గాంధీ తొలిసారిగా.. తెలంగాణకు రానుడంటం.. అందులోను రాహుల్ తో కలిసి వస్తుండటంతో.. ఈ టూర్ ను కాంగ్రెస్ ప్రతిష్టత్మకంగా తీసుకుంది. ఈ పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేసి.. ప్రచారంలో గులాబీ బాస్ పై అప్పర్ హ్యాండ్ సాదించాలని ఉవ్వీళ్ళూరుతుంది హస్తం పార్టీ.
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్కు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తుండగా, ఇప్పుడు పార్టీ అధినాయకత్వమే రంగంలోకి దిగుతోంది. ఈ క్రమంలో పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యకురాలు సోనియాగాంధీ తెలంగాణాకు వస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు సోనియా, రాహుల్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్కు వచ్చి, అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బహిరంగసభకు భారీగా జనసమీకరణ చేసే బాధ్యతను జిల్లాల వారీగా నాయకులకు అప్పగించింది. ఈ సభ ద్వారా పార్టీ సత్తాను టీఆర్ఎస్కు చాాటాలన్న లక్యంతో హస్తం నాయకత్వం సోనియా టూర్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మేడ్చల్ బహిరంగసభలో ప్రధాన ఆకర్షణగా సోనియాగాంధీ నిలవనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనక సోనియాగాంధీ హస్తముందనే వాదనల నేపథ్యంలో సోనియా రాక కచ్చితంగా తమకు కలసి వస్తుంన్నది హస్తం పార్టీ భావన. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియాగాంధీ తొలిసారి వస్తుండడంతో, ఆమె ఏం మాట్లాడతారన్నది ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ కృషి, టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, రైతు సమస్యలపై సోనియాగాంధీ ప్రసంగించే అవకాశముందని సమాచారం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తమకు ఓ అవకాశమివ్వాలని ప్రజలకు సోనియా విజప్తి చేయనున్నారు.
రాహుల్గాంధీ ప్రసంగంపై కూాడా కాంగ్రెెస్ అభ్యర్థులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో హైదరాబాద్లో జరిగిన రాహుల్ గాంధీ మీటింగ్ విజయవంతం కావడమే కాకుండా, కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచింది. ఇప్పుడు మరో సారి రాహుల్, తెలంగాణాకు రావడం కచ్చితంగా తమకు కలసి వస్తుందని, పార్టీలో నూతనోత్తేజం పెంచుతుందని అభ్యర్థులు చెబుతున్నారు.
తొలిసారిగా తెలంగాణాకు వస్తున్న సోనియాగాంధీని తెలంగాణ పౌర సమాజం ఘనంగా సన్మానించనుంది. ప్రజా కూటమి నాయకులు కోదండరాం, ఎల్ రమణ, చాడా వెంకట్ రెడ్డిలు కూడా సోనియా సభలో పాల్గొననున్నారు. అందరూ కలసి ఎన్నికల ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలాగే, సోనియాగాంధీ చేతుల మీదుగా. కాంగ్రెస్ పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







