వీకెండ్ కాన్సర్ట్ వద్ద అభిమానుల ఆందోళన
- November 24, 2018
అబుధాబి:వీకెండ్ ఎఫ్1 వన్ కాన్సెర్ట్ అభిమానులు డు ఎరీనా వద్ద ఆందోళన చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి, గేట్లను ధ్వంసం చేశారు. రాత్రి 9.30 నిమిషాల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్లను ఓపెన్ చేయాల్సిందిగా అభ్యర్థించిన ఆందోళనకారులు, చివరికి సంయమనం కోల్పోయారు. టిక్కెట్ల కొనుక్కున్న తమను సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారని దుబాయ్ రెసిడెంట్ అయిన అలీసా ఆవేదన వ్యక్తం చేశారు. ఐరిష్ వలసదారుడు మాట్లాడుతూ, తన భార్య, మరికొందరు స్నేహితులతో కలిసి టిక్కెట్లు కొన్నప్పటికీ తమను అనుమతించలేదని ఆరోపించారు. యూకేకి చెందిన టూరిస్ట్ ఒకరు 400 పౌండ్లు వెచ్చించి టిక్కెట్ కొనుగోలు చేశాననీ, అయినా తమకు అనుమతివ్వలేదనీ, ఇది చాలా బాధకరమని అన్నారు. అయితే డు అరెనీ గ్రౌండ్ కంప్లీట్గా ప్యాక్డ్ అయిపోవడంతోనే నిర్వాహకుల ఆదేశంతో మిగిలినవారిని అనుమతించలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. డు ఎరీనా కెపాసిటీ 35,000 కాగా, అంతకు మించి టిక్కెట్లు విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!







