ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో బహరేన్ లో ఎన్నికల ప్రచారం.!

- November 24, 2018 , by Maagulf

ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో  బహరేన్ లో ఎన్నికల ప్రచారం... మోసపోతే గోస పడతాం.
 తెరాస అభ్యర్థులను  గెలిపించాలని బహరేన్ తెలుగు  గల్లీ  లో ఎన్నికల ప్రచారం నిర్వహిచడం జరిగింది .ఎన్నారై  తెరాస బహరేన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ మరియు ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్  మాట్లాడుతూ 60 ఏండ్లు అధికారంలో ఉండి ఇటు గల్ఫ్ దేశంలో ఉండే తెలంగాణ బిడ్డలను పట్టించుకోలేదు అటు ప్రజల కష్టాలను పట్టించుకోలేరు గల్ఫ్ కు పోవడానికి కారణం కాంగ్రెస్ , టీడీపీ పార్టీలే మహాకూటమి నాయకులూ చెప్పే  మాయమాటలు ను నమ్మకండి రాష్ట్రాన్ని కూటమికి అప్పగిస్తే రాష్టాన్ని కుంటలో తొక్కేస్తారు 60 ఏండ్ల లో చేయని అభివృద్ధి నాలుగున్నర ఏండ్ల లో చేసి చూపించారు మన సీఎం.కెసిఆర్ గారు దేశ రాజకీయాల్లో సీఎం.కెసిఆర్ గారు బాహుబలి వంటివారు తెరాస పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము, ధర్యం,సత్తా లేక మహాకూటమి పేరుతో జట్టు కట్టుకున్నారు. దేశంలో ఏ రాష్టం లోను అమలు చేయని రీతిలో సీఎం.కెసిఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి ,గల్ఫ్ లో ఉంటున్న అన్నదమ్ములకు ఏకంగా 50 కోట్లు కేటాయిచారు భారత దేశంలోనే ఆదర్శం  గత  2014 ఎన్నికల్లో ప్రకటిచ్చినా మేనిపెస్టో వంద శాతం పూర్తి చేసిన ఘనత కెసిఆర్ మాత్రమే . ఇప్పుడు మనకు మంచి సమయం కూటమి కుట్రలను తిప్పికొట్టే సమయం వచ్చింది కూటమి నాయకులూ ఓట్లకోశం ఇంటి కొస్తే 60 ఏండ్లు ఏంచేశారని  ఇప్పుడు ఎం చేస్తారని ఎం మొకం పెట్టుకొని వచ్చారని  నిలదిచి అడగాలన్నారు. అమాయకులైన ప్రజలకు మాయ మాటలు చెప్పి మరో సారి మోసం చేయడానికి కలిసి వస్తున్నారు వారు చెప్పే మాయమాటలకు లొంగీ మోసపోతే గోసపడతాం మల్లి మన రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు . నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కోరే కెసిఆర్ కు కారు గుర్తుకు ఓటు వేసి కూటమి గువ్వా గువ్వు మానుపిచాలని కోరారు.గల్ఫ్ దేశం అయిన బహరేన్  దేశంలో "గల్ఫ్ లో టీఆర్ఎస్ "అనే నినాదం తో విస్తృతంగా సాగుతున్న టీఆర్ఎస్ ప్రచారం.

ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో  క్యాంప్ లో ఎలక్షన్ కాంపెయిన్ నిర్వహించడం జరిగింది.
 గల్ఫ్ కార్మికులు అందరూ మళ్ళీ సీఎంగా కేసీఆర్ గారు కావాలనీ తమ పూర్తి మద్దతు తెలియ జేశారు.రాబోయే ఎలెక్షన్లో తమ నియోజకవర్గంలో  గల్ఫ్ కార్మికుల విదేశాల్లో నుంచి  TRSMISSION Call campaigning ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ విధంగా మద్ధతు తెలపాలని మరియు ఈ యొక్క కాలింగ్ ప్రక్రియ ను ఏ విధంగా చేయాలో వివరించడం జరిగింది .కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, రాజేందర్ మగ్గిడి, గంగాధర్ గుముళ్ల, సెక్రెటరీలు విజయ్ ఉండింటి, ప్రమోద్ బొలిశెట్టి, జాయింట్ సెక్రటరీ నేరెళ్ల రాజు, సాయన్న కొత్తూరు, రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ బాజన్న, నర్సయ్య తలరి, గణేష్ నుకాల,మోసిస్ తదితరులు  పాల్గొన్నారు.

ఎం. వాసుదేవరావు 
(మాగల్ఫ్ ప్రతినిధి),
 బహరేన్ ​

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com