తీవ్రస్థాయికి చేరిన పెట్రోధరలపై ఆందోళనలు
- November 24, 2018
పారిస్: ఫ్రాన్స్లో పెట్రోధరలపై వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ ఆందోళనల్లో వాహన డ్రైవర్లు, రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు పాల్గొంటున్నాయి. 'ఎల్లో వెస్ట్'ల పేరుతో జరుగుతున్న ఆందోళనల్లో నేడు ఏడుగురు పోలీసులు గాయపడినట్లు సమాచారం. పెట్రో ధరలపై పన్నులను తగ్గించాలంటూ ఈ ఆందోళనలను చేపట్టారు. ఒక్క పారిస్లో జరిగిన ఆందోళనల్లోనే దాదాపు 30వేల మందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి గ్రెనేడ్ పట్టుకొని అధ్యక్షభవనం వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో దేశ అధ్యక్ష భవనం వద్ద ఆందోళనలు చేయడాన్ని నివారిస్తూ ప్రభుత్వం నిషేధించింది. ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 17మందికి తీవ్రగాయాలయ్యాయి. వాహనదారులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!