తీవ్రస్థాయికి చేరిన పెట్రోధరలపై ఆందోళనలు
- November 24, 2018
పారిస్: ఫ్రాన్స్లో పెట్రోధరలపై వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ ఆందోళనల్లో వాహన డ్రైవర్లు, రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు పాల్గొంటున్నాయి. 'ఎల్లో వెస్ట్'ల పేరుతో జరుగుతున్న ఆందోళనల్లో నేడు ఏడుగురు పోలీసులు గాయపడినట్లు సమాచారం. పెట్రో ధరలపై పన్నులను తగ్గించాలంటూ ఈ ఆందోళనలను చేపట్టారు. ఒక్క పారిస్లో జరిగిన ఆందోళనల్లోనే దాదాపు 30వేల మందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి గ్రెనేడ్ పట్టుకొని అధ్యక్షభవనం వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో దేశ అధ్యక్ష భవనం వద్ద ఆందోళనలు చేయడాన్ని నివారిస్తూ ప్రభుత్వం నిషేధించింది. ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 17మందికి తీవ్రగాయాలయ్యాయి. వాహనదారులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







