లహరి చేతికి 'ఎన్టీఆర్ ' ఆడియో హక్కులు
- November 26, 2018
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లలో 'ఎన్టీఆర్' బయోపిక్ ఒకటి. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ , నిర్మిస్తున్న ఈ మూవీ ఫై యావత్ తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్..కథానాయకుడు' పేరుతో , రాజకీయ ప్రస్థానాన్ని 'ఎన్టీఆర్ - మహానాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు. జనవరి 9న సంక్రాంతి కానుకగామొదటి భాగాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఎన్నో విషయాలు బయటకు రాగా , తాజాగా ఈ బయోపిక్ ఆడియో రైట్స్ కు సంబందించిన వార్త బయటకు వచ్చింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి సంబందించిన ఆడియో రైట్స్ ను భారీ రేటుకు లహరి మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. గతంలో కీరవాణి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'గాండీవం', 'బొబ్బిలి సింహం' 'పాండురంగడు' వంటి సినిమాలు మ్యూజికల్గా మంచి విజయాలే సాధించాయి. ఇపుడు ఈ బయోపిక్ కూడా అలాగే విజయం బాట వేస్తుందని అంత నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







