నర్సులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- November 28, 2018
బెంగళూరు: ఓ వ్యక్తి 32 మంది నర్సులను జర్మన్ భాషలో శిక్షణ పేరిట అర్మేనియాకు తరలించేందుకు యత్నిస్తుండగా బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. మంగళూరుకు చెందిన టోనీ టామ్ నర్సులకు రెండు నెలలపాటు జర్మన్ భాషలో శిక్షణ తర్వాత జర్మనీ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 32 మంది నర్సులను అర్మేనియాకు తరలించేందుకు యత్నించాడు. నర్సులను అక్రమంగా రవాణా చేస్తున్నారని అనుమానంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి నర్సులను అక్రమ రవాణా చేస్తున్న టోనీటామ్ ను అరెస్టు చేసి 32 మంది నర్సులను కాపాడారు. అర్మేనియాలో జర్మన్ భాష నేర్పే విద్యాలయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు టోనీటామ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!