నర్సులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- November 28, 2018బెంగళూరు: ఓ వ్యక్తి 32 మంది నర్సులను జర్మన్ భాషలో శిక్షణ పేరిట అర్మేనియాకు తరలించేందుకు యత్నిస్తుండగా బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. మంగళూరుకు చెందిన టోనీ టామ్ నర్సులకు రెండు నెలలపాటు జర్మన్ భాషలో శిక్షణ తర్వాత జర్మనీ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 32 మంది నర్సులను అర్మేనియాకు తరలించేందుకు యత్నించాడు. నర్సులను అక్రమంగా రవాణా చేస్తున్నారని అనుమానంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి నర్సులను అక్రమ రవాణా చేస్తున్న టోనీటామ్ ను అరెస్టు చేసి 32 మంది నర్సులను కాపాడారు. అర్మేనియాలో జర్మన్ భాష నేర్పే విద్యాలయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు టోనీటామ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం