నర్సులను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
- November 28, 2018
బెంగళూరు: ఓ వ్యక్తి 32 మంది నర్సులను జర్మన్ భాషలో శిక్షణ పేరిట అర్మేనియాకు తరలించేందుకు యత్నిస్తుండగా బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. మంగళూరుకు చెందిన టోనీ టామ్ నర్సులకు రెండు నెలలపాటు జర్మన్ భాషలో శిక్షణ తర్వాత జర్మనీ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 32 మంది నర్సులను అర్మేనియాకు తరలించేందుకు యత్నించాడు. నర్సులను అక్రమంగా రవాణా చేస్తున్నారని అనుమానంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి నర్సులను అక్రమ రవాణా చేస్తున్న టోనీటామ్ ను అరెస్టు చేసి 32 మంది నర్సులను కాపాడారు. అర్మేనియాలో జర్మన్ భాష నేర్పే విద్యాలయం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు టోనీటామ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







