అమెరికాను హెచ్చరించిన వాతావరణ శాఖ
- November 28, 2018మధ్య అమెరికాను మంచుతుఫాన్ వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా ఈశాన్య మిస్సోరి, మిచిగాన్, చికాగో ప్రాంతాల్లో భారీగా మంచు పడుతుండటంతో జనజీవనం స్థంభించింది. దీంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వాణిజ్య, వ్యాపార, కార్యాలయాలు, పాఠశాలలు మూతపడ్డాయి.
ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మంచుతోపాటు భీకరమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో ధ్యాంక్ గివింగ్ హాలిడే సందర్బంగా బయటకు రాకుండా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో చికాగోలో 13 అంగులాల మంచు కురిసిందని అధికారులు తెలిపారు. 3లక్షల 40వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రోడ్లపై పెద్ద ఎత్తున మంచు కూరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగిస్తూ రాకపోకను పునరుద్ధరిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
కేన్సస్ మిస్సోరి, నెబ్రస్కాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల ఆరు నుంచి 10 అంగుళాల మందంలో మంచు కురిసింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. 16 వందల విమాన సర్వీసులు రద్దు కాగా, 15 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. షికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అత్యధికంగా 770 విమానాలు, కేన్సస్ సిటీ నుంచి 187, షికాగో మిడ్వే నుంచి 124 విమానాలు రద్దయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్