భారీ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ 10 మంది
- November 28, 2018
రస్ అల్ ఖైమా:రస్ అల్ ఖైమా లో జరిగిన ఓ భారీ అగ్ని ప్రమాదం నుంచి 10 మంది రెసిడెంట్స్ క్షేమంగా బయటపడ్డారు. అల్ ఉరైబి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు రస్ అల్ ఖైమా సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే సివిల్ డిఫెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. వాటర్, ఫోమ్ ఉపయోగించి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 10 మందిని సివిల్ డిఫెన్స్ రక్షించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించేందుకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని ఉపయోగించాలనీ, ఈ విషయంలో ఎవరూ రాజీ పడకూడదని సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్