షార్జాలో 28 ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ బస్ షెల్టర్స్ ప్రారంభం
- November 28, 2018
షార్జా:షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ప్రయాణీకుల సౌకర్యార్ధం 28 ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ బస్ షెల్టర్స్ని ప్రారంభించింది. మొత్తం 172 బస్ షెల్టర్స్కి ఇదివరకే ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. మొత్తం 16 మిలియన్ దిర్హామ్లతో వీటిని నిర్మించనున్నారు. 28 ఇప్పటికే పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో వున్నాయి. అంతర్జాతీయ స్థాయి వసతులతో, సోలార్ పవర్డ్ బస్ స్టాప్స్గా వీటిని రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్ షెల్టర్స్ని ప్రారంభించనున్నట్లు సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి చెప్పారు. అన్ని బస్ షెల్టర్స్ ఎల్ఇడి స్క్రీన్స్ కలిగి వుంటాయని, పబ్లిక్ బస్ రూట్స్కి సంబంధించి నెంబర్, టైమింగ్ అక్కడ డిస్ప్లే అవుతాయని ఎస్ఆర్టిఎ డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ అబ్దుల్అజీజ్ అల& జర్వాన్ చెప్పారు. కొత్త బస్ షెల్టర్స్ 10 నుంచి 15 మందికి ఒకేసారి అకామడేట్ చేయగలవు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇవి పనిచేస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







