షార్జాలో 28 ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ బస్ షెల్టర్స్ ప్రారంభం
- November 28, 2018
షార్జా:షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, ప్రయాణీకుల సౌకర్యార్ధం 28 ఎయిర్ కండిషన్డ్ పబ్లిక్ బస్ షెల్టర్స్ని ప్రారంభించింది. మొత్తం 172 బస్ షెల్టర్స్కి ఇదివరకే ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. మొత్తం 16 మిలియన్ దిర్హామ్లతో వీటిని నిర్మించనున్నారు. 28 ఇప్పటికే పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో వున్నాయి. అంతర్జాతీయ స్థాయి వసతులతో, సోలార్ పవర్డ్ బస్ స్టాప్స్గా వీటిని రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్ షెల్టర్స్ని ప్రారంభించనున్నట్లు సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి చెప్పారు. అన్ని బస్ షెల్టర్స్ ఎల్ఇడి స్క్రీన్స్ కలిగి వుంటాయని, పబ్లిక్ బస్ రూట్స్కి సంబంధించి నెంబర్, టైమింగ్ అక్కడ డిస్ప్లే అవుతాయని ఎస్ఆర్టిఎ డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ అబ్దుల్అజీజ్ అల& జర్వాన్ చెప్పారు. కొత్త బస్ షెల్టర్స్ 10 నుంచి 15 మందికి ఒకేసారి అకామడేట్ చేయగలవు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇవి పనిచేస్తాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







