బహ్రెయిన్ పార్లమెంట్కి యంగ్ లుక్
- December 03, 2018
బహ్రెయిన్:కొత్తగా పార్లమెంటుకు ఎంపికైనవారిలో ఎక్కువమంది యువత అలాగే మహిళలు వుండడంతో పార్లమెంటు కొత్త లుక్ని సంతరించుకోనుంది. గతంలో ముగ్గురు మహిళా పార్లమెంటేరియన్లు వుంటే, ఇప్పుడు వారి సంఖ్య 6కి చేరుకుంది. ఇప్పటిదాకా పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించినవారిలో పలువురు ఓటమి చవిచూశారు. కొత్తవారికి ఈసారి పార్లమెంటులో అవకాశం దక్కింది. ప్రజా ప్రతినిథుల తీరుతో అసంతృప్తితో వున్న బహ్రెయిన్ సమాజం, కొత్తవారి వైపు మొగ్గు చూపింది. పాతవారికి ఎక్కువగా ఇంటి ముఖం చూపించారు ఓ టర్లు. హేమాహేమీలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అలి అహ్మద్ అల్ జాయెద్, ఇసా అల్ ఖాధి, యూసుఫ్ జైనాల్, అబ్దుల్ నమి సల్మాన్ తదితరులు ఇంకోసారి విజయం సాధిస్తే, రువా అల్ హైకి, మొహమ్మద్ అల్ మారిఫి, మొహమ్మద్ అల్ అమ్మాది, అబ్దుల్రహ్మాన్ బుంజైద్, నాసర్ అల్ ఖసీర్, అలి అల్ అతిష్, ఇబ్రహీమ్ అల్ హమ్మాది, మొహమ్మద్ అల్ అహ్మద్, అబ్దుల్ రహ్మాన్ బు అలి తదితరులు ఓటమి పాలయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







