మరో మల్టీప్లెక్స్ నిర్మించనున్న మహేష్
- December 04, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్ను నిర్మించడం ఎంత హాట్ టాపిక్గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ 2న సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ మల్టీ ప్లెక్స్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత విలాస వంతమైన లగ్జరీ కాంప్లెక్స్ గా రూపొందిన ఈ కాంప్లెక్స్లో ప్రేక్షకులు వరల్డ్ క్లాస్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొందేలా తీర్చి దిద్దారు. ఇందులో మొత్తం 7 స్క్రీన్స్ ఉండగా 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తొలిసారి మల్టీ ప్లెక్స్ వ్యాపార రంగంలోకి దిగిన మహేష్ దీని కోసం 80 కోట్లు పెట్టుబడి పెట్టారని అంటున్నారు. ఈ మల్టీ ప్లెక్స్ కు సంబంధించిన ఇంటీరియర్ వర్క్ ను మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా పర్యవేక్షించినట్లు సమాచారం. ఈమూవీ థియేటర్స్ లోని స్క్రీన్తో పాటు సౌండ్ క్వాలిటీ ప్రపంచ స్థాయిలో కనిపించింది. ముఖ్యంగా అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ లుక్ ఈ 'ఏఎంబి సినిమాస్' ప్రత్యేకత. అయితే మహేష్ బాబు మరో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ని హైదరాబాద్లో నిర్మించేందుకు ప్లాన్స్ వేస్తున్నట్టు సమాచారం.
సినిమా రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తితో కలిసి మహేష్ తన కార్యాచరణ చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మహేష్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్









